న్యూఢిల్లీ : తప్పుడు ఆరోపణలతో దాఖలు చేసిన లైంగిక దాడి కేసును వెనక్కి తీసుకునేందుకు రూ 50 లక్షలు డిమాండ్ చేసిన తల్లీకూతుళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గురుగ్రాంలో వెలుగుచూసింది. పిర్యాదును ఉపసంహరించేందుకు బాలిక రూ 50 లక్షలు అడగడంతో నిందితుడి సోదరుడు బాలిక, ఆమె తల్లిపై సెక్టార్ 51, మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
దీంతో బాలికను భివానీలో అరెస్ట్ చేసిన పోలీసులు గురుగ్రాంలోని సెక్టార్ 47 నుంచి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై లైంగిక దాడి ఆరోపణలపై తప్పుడు కేసు నమోదు చేశారనే అభియోగాలు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా బాలిక తల్లి నుంచి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
తప్పుడు లైంగిక దాడి కేసును ఉపసంహరించేందుకు నిందితులను తల్లీకూతుళ్లు రూ 50 లక్షలు డిమాండ్ చేయగా, ఆపై రూ 30 లక్షలకు ఒప్పందం కుదిరింది. కొంతమొత్తం వారికి చెల్లించేందుకు తల్లీకూతుళ్లను ఓ రెస్టారెంట్లో కలుస్తామని ఫిర్యాదుదారు పోలీసులకు సమాచారం అందించగా రెస్టారెంట్కు చేరుకున్న పోలీసులు బాలికను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తల్లీకూతుళ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.