హైదరాబాద్ : హైదరాబాద్లోని బాలానగర్లో విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. గృహిణి అనిత(26) మొదట తన ఇద్దరు పిల్లలకు ఉరేసి చంపింది. ఆ తర్వాత ఆమె ఇంట్లోనే ఉరేసుకుంది. పాపకు రెండేండ్ల వయసు ఉండగా, బాబు వయసు ఏడాది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ తగాదాల కారణంగానే అనిత ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.