న్యూఢిల్లీ : మహిళను బైక్పై వెంబడించిన ఇద్దరు దుండగులు ఆమె మొబైల్ ఫోన్ను గుంజుకుని పారిపోయిన ఉదంతం ఘజియాబాద్లోని వైశాలిలో వెలుగుచూసింది. కుశాంబి పోలీస్ స్టేషన్ పరిధిలోని వైశాలి సెక్టార్ 1లో ఈ ఘటన జరిగింది.
మహిళ ఫోన్లో మాట్లాడుతూ వెళుతుండగా బైక్పై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు అదును చూసి మొబైల్ ఫోన్ను లాక్కుని పారిపోయారు. మహిళ వారిని వెంబడించినా వారు బైక్పై వేగంగా పారిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఇక ఘజియాబాద్లో మరో ఘటనలో బైక్పై వచ్చిన ఇద్దరు నేరగాళ్లు ఓ జంట నుంచి రూ 3 లక్షలు చోరీ చేసి పరారయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఓ జంట రూ 3 లక్షలు డ్రా చేసి ఇంటికి వెళుతూ లజ్పత్ చౌక్కు చేరుకోగానే స్కూటర్పై వచ్చిన ఇద్దరు దుండగులు వారి బ్యాగ్ను గుంజుకుని క్షణాల్లో ఉడాయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.