జైపూర్ : చిన్న వయసులోనే తల్లితండ్రులు వివాహం జరిపించగా అత్తింటి వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లేందుకు ప్రయత్నించిన మైనర్ బాలిక (14)ను దుండగులు వ్యభిచార రొంపిలోకి దింపిన దారుణ ఘటన రాజస్ధాన్లోని జైసాల్మీర్లో వెలుగు చూసింది. అల్వార్కు సమీపంలోని గ్రామానికి చెందిన బాలికకు చిన్న వయసులోనే వివాహం చేశారు. అత్తవారింట్లో వేధింపులు భరించలేని బాలిక ఇంటి నుంచి పారిపోయి తల్లిని చూసేందుకు తమ గ్రామం వెళ్లాలని ప్రయత్నించింది.
ఈ క్రమంలో తండ్రి తాగుడుకు బానిసై మరో మహిళను పెండ్లి చేసుకోవడంతో బాలిక తల్లి అతడిని విడిచివెళ్లింది. పుట్టింటిలోనూ తండ్రి, సోదరుడు ఆమెను హింసించడంతో దిక్కుతోచని స్ధితిలో తల్లిని వెతుక్కుంటూ పుట్టింటిని వీడింది. తల్లి కోసం వెతుకుతుండగా ట్యాక్సీ డ్రైవర్ పరిచయమై అతడు బాలికను మానసరోవర్కు చెందిన రాజు పండిట్కు అప్పగించాడు. ఆపై పండిట్ బాలికను వ్యభిచార రొంపిలోకి దించాడు. ఆ కూపం నుంచి బయటపడిన బాలిక జైసాల్మీర్ రైల్వే స్టేషన్కు చేరుకోగా అక్కడి సిబ్బంది ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. బాలిక ఫిర్యాదుపై మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది దర్యాప్తు చేపట్టారు.