ఛత్తీస్గఢ్ : దంతెవాడ జిల్లాలోని టాటమ్ గ్రామంలో టెటం పీఎస్ కానిస్టేబుల్ ఉమేష్ మార్కంను మావోయిస్టులు నిన్న రాత్రి పదునైన ఆయుధాలతో హత్య చేశారు. బుధవారం ఉదయం జవాన్లు మృతదేహాన్ని వెలికితీశారు. మావోయిస్టులను మట్టుబెట్టేందుకు టాటమ్ గ్రామంలో క్యాంప్ను ప్రారంభించడంలో ఉమేశ్ కీలక పాత్ర పోషించాడు. కాగా, ఉమేశ్ మృతిని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ ధృవీకరించారు.