హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కేసుల ఉధృతి తగ్గడం తో హైదరాబాద్ నుంచి బ్రిటన్ వెళ్లే విమాన సర్వీసులను పునరుద్ధరించారు. ఈనెల 6న లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం హైదరాబాద్కు వచ్చింది. తిరిగి అదే విమానం (బీఎ-276) బుధవారం ఉదయం 7.15 గంటలకు ప్రయాణికులతో లండన్ బయలుదేరింది. కొవిడ్ రెందోదశ కేసులు భారత్, బ్రిటన్లో విజృంభించడంతో కొంతకాలం విమాన సర్వీసులు నిలిపివేశారు. అటు బ్రిటన్లో ఇటు భారత్లో పరిస్థితులు మెరుగుపడడంతో సర్వీసులను తిరిగి ప్రారంభించినట్టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ప్రకటించారు.