హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కిడ్నాప్కు గురయ్యాడు. గాదె శంకర్ అనే వ్యక్తిని కల్వకుర్తికి చెందిన ప్రశాంత్ కిడ్నాప్ చేశాడు. ఈ మేరకు శంకర్ భార్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. ప్రవళిక అనే యువతికి, ఆమె భర్త చైతన్యకు మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రవళిక తన భర్తతోపాటు, అతని అన్నలైన కిరణ్, శంకర్ మీద కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తుండగానే ప్రవళిక అన్న ప్రశాంత్.. ప్రవళిక బావ గాదె శంకర్ను కిడ్నాప్ చేశాడు. దాంతో శంకర్ భార్య.. తన భర్తను ప్రశాంతే కిడ్నాప్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.