తెలుగుయూనివర్సిటీ:గుర్తు తెలియని ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సిఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం…హఫీజ్పేట-చందానగర్ రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 30సంవత్సరాల వ్యక్తి సోమవారం రైలు ఢీకొనడంతో తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెంది నట్లు తెలిపారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లుగా భావిస్తున్నారు.
శవపంచనమా నిర్వహించి ఉస్మానియా దవఖాన మార్చురీలో మృతదేహన్ని భధ్రపరిచామన్నారు. మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మృతుడి శరీరంపై నలుపు రంగు షార్ట్, మెరున్, సిమెంట్ కలర్ గీతల ఆఫ్ హ్యాండ్ టీ షర్టు ధరించి ఉన్నా డని, వివరాలకు 040-23202238, 9866357238, 9440627515నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.