ముంబై : దేశ వాణిజ్య రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఎనిమిది నెలల గర్భవతి(20)ని హత్య చేసిన వ్యక్తి(22)ని పోలీసులు అరెస్ట్ చేశారు. 20 ఏండ్ల కోమల్ సంజయ్ సొంకర్ అనే మహిళ బుధవారం ఆమె ఇంట్లో విగతజీవిగా పడిఉంది.
గర్భస్ధ శిశువు కూడా మరణించిన ఈ ఘటన వెలుగులోకి రాగానే కేసు నమోదు చేసిన పోలీసులు నిందిడుతు అర్జున్ సొంకర్ను అరెస్ట్ చేశారు. నిందితుడు బాధితురాలి భర్త సంజయ్కు వరుసకు సోదరుడు అవుతాడని పోలీసులు తెలిపారు.
అర్జున్ గత కొద్దినెలలుగా సంజయ్ దంపతులతో కలిసి వారి ఇంట్లో ఉంటున్నాడు. మహిళను ఊపిరిఆడకుండా చేసి నిందితుడు హత్య చేశాడని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే మహిళ హత్యకు కారణాలేమిటన్నది ఇంకా తెలియరాలేదు.