న్యూఢిల్లీ : గురుగ్రామ్లోని డీఎల్ఎఫ ఫేజ్ త్రీ ప్రాంతంలో మంగళవారం రాత్రి మహిళ (24)పై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి కత్తిపోట్లకు గురిచేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బిహార్కు చెందిన అనిల్ ఠాకూర్గా గుర్తించిన పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలి భర్త ఆమెను ఆస్పత్రిలో చేర్పించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
బాధితురాలు ప్రస్తుతం ఢిల్లీలోని సప్ధర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై బాధితురాలి భర్త ఆటోడ్రైవర్ డీఎల్ఎఫ్ ఫేజ్ త్రీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి భార్య నుంచి తనకు కాల్ వచ్చిందని ఆమె కత్తిపోట్లకు గురయ్యానని చెప్పగా తాను ఎక్కడ ఉన్నావని అడిగానని చెప్పాడు.
తనను వెంటనే ఇంటికి రావాలని కోరిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని వారిలో ఒకరు కత్తితో పొడిచాడని చెప్పిందని తెలిపాడు. బాధితురాలి భర్త ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడిని ప్రశ్నిస్తున్నామని గురుగ్రాం పోలీస్ కమిషనర్ కళా రామచంద్రన్ వెల్లడించారు.