తిరువనంతపురం : ప్రముఖ మళయాళ నటుడు ఎన్డీ ప్రసాద్ (43) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొచ్చికి సమీపంలోని కలమసెరిలోని ఇంటి వెలుపల చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. ఎన్డీ ప్రసాద్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
పలు మళయాళ సినిమాల్లో నటించిన ప్రసాద్కు యాక్షన్ హీరో బిజులో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. కుటుంబ వివాదాలతోనే ప్రసాద్ తనువు చాలించాడని సమాచారం. కొన్ని నెలలుగా ప్రసాద్కు ఆయన భార్య దూరంగా ఉంటున్నారని తెలిసింది.
మరణించే ముందు కొన్ని రోజులుగా ఆయన కుంగుబాటుకు లోనైనట్టు తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. గతంలో డ్రగ్స్ తీసుకుంటారని ప్రసాద్పై ఆరోపణలు రావడంతో పాటు ఆయన వద్ద నుంచి మారణాయుధాలను పోలీసులు సీజ్ చేసిన ఘటనలున్నాయి.