న్యూఢిల్లీ : గ్రేటర్ నోయిడాలో మంగళవారం మద్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నోయిడాలోని కస్నా ప్రాంతంలోని మురికివాడలో మంటలు చెలరేగడంతో దాదాపు 50 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. స్ధానికులు సమాచారం అందించడంతో ఘటనా స్ధలానికి హుటాహుటిన అగ్నిమాపక యంత్రాలను తరలించారు.
అరడజనుకు పైగా వచ్చిన అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చామని అధికారులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, ఎవరికీ గాయాలైన సమాచారం లేదని అధికారులు వెల్లడించారు.