భోపాల్ : ఓ పిల్లాడిని వీధి కుక్క కరిచింది. తన బిడ్డను గాయపరిచిన కుక్కను తండ్రి ఇనుపరాడ్తో చితక్కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆ శునకం కాళ్లను తండ్రి నరికేశాడు. దీంతో చివరకు ఆ కుక్క ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో చోటు చేసుకుంది.
సీమరియతల్ గ్రామానికి చెందిన సాగర్ విశ్వాస్కు ఓ కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లాడు ఆడుకుంటుండగా ఓ వీధి కుక్క కరిచింది. అతనితో పాటు మరో ఐదుగురిపై కూడా కుక్క దాడి చేసి గాయపరిచింది. దీంతో కోపంతో ఊగిపోయిన విశ్వాస్.. ఆ కుక్కను వెంబడించి ఇనుప రాడ్తో చితక్కొట్టాడు. అనంతరం దాని కాళ్లను పదునైన ఆయుధంతో నరికేశాడు. నడవలేని పరిస్థితిలో ఉన్న ఆ శునకం చివరకు ప్రాణాలు కోల్పోయింది.
ఈ తతాంగాన్ని స్థానికులు కొందరు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోర్టు ముందు హాజరు కావాలని విశ్వాస్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.