యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం సృష్టించింది. బహుపేట రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి యువజంట బలవన్మరణానికి పాల్పడించింది. గుర్తించిన రైల్వే సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను భువనగిరి మండలం బస్వాపూర్కు చెందిన ఉడుతల గణేశ్ (25), నలంద (23)గా గుర్తించారు.
కాగా, మృతురాలు నలందకి మూడేండ్ల క్రితం యాదగిరిగుట్టకు చెందిన వ్యక్తితో వివాహమైంది. యాదగిరిగుట్టపై విధులు నిర్వహిస్తున్న అతడు రాత్రి 11 గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా.. తన భార్య కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే
బహుపేట రైల్వే పట్టాల వద్ద మృతదేహాలను గమనించిన రైల్వే సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 2.30 గంటల సమయంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.