చార్మినార్ : డబ్బులు డిమాండ్ చేస్తే నిరాకరించాడని కక్షపెంచుకున్న ఒక వ్యక్తి మరో వ్యక్తిపై రసాయనం చల్లి నిప్పుపెట్టాడు. తీవ్రగాయాలైన బాధితున్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కేసు విచారణలో భాగంగా నిందితునికి న్యాయస్థానం జీవితఖైదు విధించిందని భవానీనగర్ ఇన్స్పెక్టర్ అమ్జద్అలీ తెలిపారు. వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆమన్నగర్ ప్రాంతానికి చెందిన సయీద్ హసైన్ అలియాస్ చమేలి (30) రౌఢీషీటర్.
గత సంవత్సరం జూన్ 18న సలాం హుక్ ప్రాంతంలో పుట్పాత్పై నిద్రిస్తున్న దస్తగిరిఖాన్ను నిద్రలేపి 100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో చమేలి తన వద్ద ఉన్న ఓ రసాయనాన్ని దస్తగిరిపై చల్లి నిప్పు పెట్టాడు.
దీంతో దస్తగిరి 46 శాతం కాలిన గాయాలతో పడిపోయాడు. స్థానికుల ద్వార సమచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని భాదితున్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుని ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని తెలిపారు.
కేసు విచారణలో భాగంగా ఐ.ఓ కుమారస్వామి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. దర్యాప్తులో పోలీసులు అందించిన సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితునికి జీవితఖైదు విదించారని తెలిపారు. కేసులో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ కుమారస్వామిని, కోర్టు సిబ్బందిని ఇన్స్పెక్టర్ అమ్జద్అలీ ప్రత్యేకంగా అభినందించారు.