మారేడ్పల్లి : రైల్లో ప్రయాణికుల ల్యాప్టాప్, ఏటీఎం కార్డులను దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ మాజీద్ కథనం.. బన్సీలాల్పేట వాసి నానీ (22), మహబూబాబాద్ వాసి రాము (29)లు సికింద్రాబాద్లోని పెట్రోల్ బంక్ల వద్ద కార్ పాలిష్ బాటిళ్లను విక్రయిస్తుంటాడు.
అంతేగాక అధిక డబ్బులు సంపాధించాలని చోరీల బాటపట్టాడు. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీ మణుగూరు ఎక్స్ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడు సీట్పై ఉంచిన ల్యాప్టాప్ను బ్యాగుతో పాటు అందులో ఉన్న ఏటీఎం కార్డులను దొంగిలించారు.
మంగళవారం దాన్ని ఏటీఎం వద్ద డ్రా చేసేందుకు ప్రయత్నించగా అందులో ఉన్న సిమ్ కార్డు ద్వారా వచ్చిన సమాచారాన్ని బాధితుడు పోలీసులకు తెలియజేయడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై దగ్గరలోనే ఉన్న ఏటీఎం సెంటర్ వద్దకు వెళ్లి అక్కడున్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి ల్యాప్టాప్, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.