శంషాబాద్: విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి సినీ ఫక్కీలో పేస్టుగా మార్చి బంగారం స్మగ్లింగ్కు విఫయత్నం చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్టులో శుక్రవారం చోటుచేసుకుంది. సదరు స్మగ్లర్ నుంచి కేజీ స్మగ్లింగ్ బంగారం ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..సైఫుల్ మహ్మద్ రఫీక్ అనే ప్రయాణీకుడు జీ9 458 విమానంలో షార్జా నుంచి హైదరాబాద్కు వచ్చాడు.
అనుమానస్పదంగా కనిపించిన రఫీక్ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా తను వేసుకున్న దుస్తులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న విభాగంలో బంగారం పేస్టును దాచి ఉంచాడు. కస్టమ్స్ అధికారుల తనిఖీలో బంగారాన్ని గుర్తించి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం పరిమాణం కేజీ వరకు ఉంది. దాని విలువ రూ. 43, 55,147. వరకు ఉంటుంది. ఈ మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.