జమ్మూకశ్మీర్ : అన్ని మతాలు సమానమే, మనందరం ఒక్కటేనని బోధిస్తూ.. పిల్లలను సరైన మార్గంలో పెట్టాల్సిన టీచరే వారిపట్ల క్రూరంగా ప్రవర్తించాడు. నుదుటిపై తిలకం పెట్టుకుని స్కూల్కు వచ్చిన ఓ అమ్మాయిని అసభ్యకర పదజాలంతో దూషిస్తూ, ఆమెను చితకబాదాడు. ఈ ఘటన జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో వెలుగు చూసింది.
అయితే విద్యార్థినిని టీచర్ కొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియో రాజౌరీ జిల్లా డిప్యూటీ కమిషనర్కు చేరడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు టీచర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు టీచర్ నిసార్ అహ్మద్ సస్పెన్షన్లోనే ఉంటారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.