పుణే : బాలికతో సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఆమె కుటుంబ సభ్యులు యువకుడిని హత్య చేసిన ఉదంతం మహారాష్ట్రలోని పుణేలో కలకలం రేపింది. బాధిత యువకుడిని ప్రద్యుమ్న్ కాంబ్లే (22)గా గుర్తించారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా బాలికతో ఎఫైర్ నడుపుతున్నాడనే ఆగ్రహంతో నలుగురు వ్యక్తులు ప్రద్యుమ్న్ను అంతమొందించారు.
నిందితుల్లో బాలిక కుటుంబ సభ్యులతో పాటు మరొకరు ఉన్నట్టు గుర్తించారు. మార్చి 16న ప్రద్యుమ్న్ ఇంటి వద్ద నిందితులు ఇనుపరాడ్లు, పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేశారు. బాలికకు దూరం కావాలని ఆమె కుటుంబసభ్యులు పలుమార్లు అతడిని హెచ్చరించినా వినకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
వర్జె ప్రాంతంలోని రామ్నగర్లో బాలిక కుటుంబ సభ్యులు ప్రద్యుమ్న్పై దాడికి పాల్పడి అతడిని హత్య చేశారు. వర్జే పోలీసులు కేసు నమోదు చేసి 12 గంటల్లోపే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో మహిళతో పాటు ఆమె భర్త, వారి కుమారుడుతో పాటు వారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు ఉన్నారని పోలీసులు తెలిపారు.