భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలో భవాని నగర్ ప్రాంతంలో దారుణం జరిగింది. గత ఏడాది డిసెంబర్లో యువతి (25)కి బ్రేక్ఫాస్ట్లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతి మత్తుమందు ప్రభావంతో స్పృహ కోల్పోగానే ఆమె అభ్యంతరకర చిత్రాలు తీసి వాటిని వైరల్ చేస్తానని బెదిరిస్తూ నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
నిందితుడి తీరుతో విసిగిన బాధితురాలు ధైర్యం కూడదీసుకుని శనివారం రాత్రి బన్గంగ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం బయటకువచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది డిసెంబర్లో ధర్మపురికి చెందిన మిథున్ జాదవ్, సన్వేర్కు చెందిన తమిళ్ షా, కోమల్ జాదవ్ భవానీ నగర్ ప్రాంతంలోని ఓ ఇంటికి పిలిచారు. ఆమెకు బ్రేక్ఫాస్ట్లో మత్తుపదార్ధం కలిపిఇచ్చారు.
ఆపై మహిళ స్ప్రహ కోల్పోగానే నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక అప్పటి నుంచి ఆమె అభ్యంతరకర ఫోటోలు బయటపెడతానని బెదిరస్తూ నిందితుడు మిధున్ పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డాడు. నిందితుడి ఆగడాలు భరించలేని మహిళ భర్తకు అసలు విషయం తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.