నోయిడా : గ్రేటర్ నోయిడాలోని బిస్రక్ ప్రాంతంలోని ఓ భవనం పదకొండో అంతస్తు నుంచి కిందకు దూకిన యువతి మరణించిన ఘటన సోమవారం కలకలం రేపింది. మృతురాలిని ఘజియాబాద్కు చెందిన కుమారి శైలి అని గుర్తించారు. యువతి తన స్నేహితురాలిని కలిసేందుకు గౌర్ సిటీకి వెళ్లిన క్రమంలో ఈ ఘటన జరిగింది.
వారిద్దరి మధ్య వివాదం చెలరేగడంతో మనస్ధాపానికి గురైన యువతి పదకొండో అంతస్తు నుంచి కిందకు దూకిందని పోలీసులు తెలిపారు. యువతిని సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు.
భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోందని, అయినా ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. యువతి స్నేహితురాలిని కూడా ప్రశ్నిస్తున్నామని చెప్పారు.