తిరువనంతపురం : త్రిసూర్లో మహిళా పారిశ్రామికవేత్త (30) గురువారం దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. మన్నర పరంబు గ్రామానికి చెందిన బాధితురాలు రిన్సీ నాజర్ టెక్స్టైల్ షాపును నిర్వహిస్తోంది.
గురువారం రాత్రి ఆమె షాపు నుంచి పిల్లలను స్కూటర్పై ఎక్కించుకుని తిరిగివస్తుండగా గతంలో అదే షాపులో పనిచేసిన ఉద్యోగి రియాజ్ (25) దాడిచేశాడు. బైక్పై రిన్సీని వెంబడించిన రియాజ్ ఆమె స్కూటర్ను ఢీకొట్టడంతో రిన్సీ కిందపడిపోయింది.
ఇదే అదునుగా ఆమె ముఖం, చేతిపై కత్తిపోట్లతో విరుచుకుపడ్డాడు. చేతి వేళ్లను కత్తిరించాడు. ఆమె శరీరంపై 30 కత్తిపోట్లు ఉన్నాయని గుర్తించారు. నిందితుడి దాడితో ఆమె ఘటనా స్ధలంలోన మరణించారు. హత్యానంతరం రియాజ్ పరారయ్యాడు. మహిళపై రియాజ్ దాడి చేస్తుండగా అడ్డగించిన స్ధానికులను కత్తితో బెదిరంచాడు. గతంలో నిందితుడు టెక్స్టైల్ షాపుకు వెళ్లి ఆమెను బెదిరించాడు.