చెన్నై : 29 ఏండ్ల వితంతు మహిళను నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై విలువైన వస్తువులతో పరారైన ఘటన తమిళనాడులోని నమక్కల్ ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ తన స్నేహితుడితో కలిసి మే 19న వీసనం లేక్ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వారిని చుట్టుముట్టి బాధితురాలి స్నేహితుడిని తీవ్రంగా గాయపరిచారు.
ఆపై మహిళను నిర్జన ప్రాంతంలోకి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులు మహిళ స్నేహితుడిని కొట్టి అతడి వద్ద నుంచి ఫోన్ తీసుకుని నేరాన్ని రికార్డు చేశారు. అనంతరం మహిళ మెడలో నుంచి 12 గ్రాముల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితులను బెదిరించారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు నవీన్ కుమార్ (21), దినేష్ కుమార్ (21) పెయింటర్గా పనిచేసే మురళిని అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.