ముంబై : మహారాష్ట్రలోని పుణేలో దారుణం వెలుగుచూసింది. ప్రియురాలి కూతురు మూడేండ్ల చిన్నారిని చావబాదిన వ్యక్తి (33) ఉదంతం కలకలం రేపింది. ఏప్రిల్ 13, 15 తేదీల మధ్య అంబెగావ్ బుద్రుక్లో ఈ ఘటన జరిగింది.
బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. రెండు రోజుల పాటు నిందితుడు తీవ్రంగా హింసించడంతో బాలిక మరణించిందని చెప్పారు. బాలిక తలను నిందితుడు పలుమార్లు గోడకు కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
డ్రైవర్గా పనిచేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దినెలలుగా నిందితుడితో బాలిక తల్లి కలిసి జీవిస్తోంది. బాలిక ప్రియురాలి మొదటి భర్త సంతానం కావడంతో చిన్నారిని నిందితుడు వేధిస్తుండేవాడు. నిందితుడిని అరెస్ట్ చేశామని, ప్రస్తుతం అతడు కస్టడీలో ఉన్నాడని భారతి విద్యాపీఠ్ ఎస్ఐ జగన్నాధ్ కలస్కర్ తెలిపారు.