రాంచీ : వదినపై కన్నేసిన మరిది ఆమెను వివిధ నగరాలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాంచీలో వెలుగుచూసింది. తనను పట్నా, ఢిల్లీ, కోల్కతా నగరాలకు విహార యాత్ర పేరుతో తీసుకువెళ్లిన మరిది ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడని రాంచీ మహిళ ఆరోపించింది. రాంచీలోని పిధోరియాకు చెందిన నిందితుడు బాధితురాలి ఇంటికి తరచూ వెళుతుండేవాడు.
ఈ క్రమంలో మార్చి 28న ఆమెను బయట కలుసుకోవాలని పిలిపించాడు. ఆపై బస్టాడ్కు తీసుకువెళ్లి పట్నాకు బయలుదేరాడు. అక్కడ నుంచి రైలులో బాధితురాలిని విహార యాత్రకు అని చెప్పి రైలులో ఢిల్లీకి తీసుకువెళ్లాడు. అక్కడ రూం అద్దెకు తీసుకుని రెండు రోజుల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆపై కోల్కతాకు వెళ్లి అక్కడ మరోసారి ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ఏప్రిల్ 4న ఇద్దరూ రాంచీకి చేరుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యులందరినీ చంపేస్తానని రైల్వేస్టేషన్లో మహిళను హెచ్చరించి పరారయ్యాడు. ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయం భర్తకు తెలిపింది. భర్తతో కలిసి అర్గోర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.