న్యూఢిల్లీ : భార్య కనిపించడం లేదని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి ఆపై ఆమెను హత్య చేసిన వ్యక్తి ఉదంతం ఢిల్లీలో వెలుగుచూసింది. జూన్ 13 నుంచి తన భార్య (35) కనిపించడం లేదని నిందితుడు ఫిర్యాదు చేశాడు. భర్తను ప్రశ్నించిన పోలీసులకు అతడిపై అనుమానం కలగడంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. పలు రకాలుగా ప్రశ్నించిన మీదట భార్యను తానే హత్య చేశానని అంగీకరించాడు.
ఆమె చెడు అలవాట్లతో విసిగి ఈ దారుణానికి పాల్పడ్డానని నేరాన్ని అంగీకరించాడు. మహిళ కనిపించకపోవడంతో తన అత్తింటి వారు బులంద్షహర్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తనపై అనుమానం రాకుండా తన భార్య అదృశ్యమైందని మిస్సింగ్ కేసు నమోదు చేశానని చెప్పాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.