న్యూఢిల్లీ : భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమె తలపై పదునైన ఆయుధంతో కొట్టి హత్య చేసిన వ్యక్తి ఉదంతం ఢిల్లీలో వెలుగుచూసింది. కూలీగా పనిచేసే చోటే భార్య పిల్లలతో కలిసి నెహ్రూ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. వీరికి ఐదుగురు సంతానం కాగా భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కలిగిఉందనే అనుమానంతో నిత్యం ఆమెను వేధిస్తుండే వాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో భార్య (48) తలపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన బాధితురాలిని జీటీబీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని సీజ్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.