జైపూర్ : రాజస్ధాన్లో దారుణం వెలుగుచూసింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన 16 ఏండ్ల బాలికను పొరుగున ఉండే వ్యక్తి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన భరత్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఘటనపై బాలిక కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు నిందితుడి ఇంటికి వెళ్లి నిలదీయగా అతడి బంధువులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలిక కుటుంబసభ్యులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాను బయటకు వెళ్లిన సమయంలో డబ్బు ఇస్తానని మభ్యపెట్టి నిందితుడు అటవీప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై తమ కుటుంబ సభ్యులు నిందితుడిని నిలదీయగా వారు తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.