లక్నో : గెస్ట్హౌస్లో 24 ఏండ్ల మహిళ మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. మహిళ తన రూంలోని సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. మృతురాలు రెండు రోజుల కిందట వృందావన్లోని బ్మహ్మ నివాస్ ఆశ్రమంలో రూం తీసుకున్నారు. అప్పటినుంచి ఆమె రూం నుంచి బయటకు రాలేదనవి గెస్ట్హౌస్ మేనేజర్ చెప్పారు.
మృతురాలిని మధ్యప్రదేశ్కు చెందిన జ్యోతి శర్మగా గుర్తించారు. గెస్ట్హౌస్ సిబ్బంది రూంను క్లీన్ చేసేందుకు తలుపు కొట్టినా ఎంతసేపటికీ తీయకపోవడంతో అనుమానం వచ్చింది. కిటికీలో నుంచి చూడగా రూం నుంచి దుర్వాసన రావడంతో పాటు సీలింగ్కు వేలాడుతూ మహిళ కనిపించింది.
ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నివేదిక కోసం తరలించారు. ఘటనా స్ధలంలో లభ్యమైన ఫోన్ ద్వారా మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.