న్యూఢిల్లీ : పేటీఎం వోచర్ల ద్వారా మహిళను రూ లక్ష మోసగించిన నిందితుడిని డిల్లీలోని ద్వారకా పోలీస్ స్టేషన్ సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని రాజస్ధాన్లోని అళ్వార్ జిల్లాకు చెందిన రషీద్ ఖాన్గా గుర్తించారు. పేటీఏం వోచర్ల ద్వారా ప్రజలను నిందితుడు మోసగిస్తున్నాడని, టెక్నికల్ సర్వైలెన్స్ ద్వారా అతడిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.
నిందితుడి నుంచి మొబైల్ ఫోన్తో పాటు సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన మహిళ ఇటీవల ఓఎల్ఎక్స్లో హెడ్ఫోన్స్ అమ్మకానికి సంబంధించి ఓ యాడ్ పోస్ట్ చేయగా ఆమెకు ఓ కాల్ వచ్చింది. పేటీఎం వోచర్ ద్వారా రూ 12,000 చెల్లిస్తానని నిందితుడు ఆమెకు నమ్మబలికాడు.
ఐదు లావాదేవీలు పూర్తయిన తర్వాత వోచర్ను చెక్ చేసుకోవాలని కోరాడు. దీంతో రూ 99,000 లావాదేవీలు ఆమెకు తెలియకుండానే జరిగినట్టు బాధితురాలు గుర్తించారు. నిందితుడి ఫోన్ నెంబర్ వివరాలతో మహిళ పోలీసులకు పిర్యాదు చేయగా ఫోన్ నెంబర్తో పాటు కాల్ రికార్డ్స్ను పరిశీలించిన మీదట నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.