జనగామ : బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామంలో దారుణం జరిగింది. గుడిద అశోక్ (30), గుడిద అండాలు భార్యాభర్తలు. వీరికి 8 నెలల బాబు ఉన్నాడు. అయితే గత కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ కలహాలతో భర్తను భార్య ఇనుపకడ్డీతో కొట్టి చంపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అండాలును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.