న్యూఢిల్లీ : గురుగ్రాంలోని నధుపూర్ ప్రాంతంలో అర్ధనగ్నంగా పడిఉన్న మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఖాళీగా ఉన్న ప్లాట్లో మహిళ మృతదేహాన్ని చూసిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహిళపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోస్ట్మార్టం నివేదికతో పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. ప్రాధమిక ఆధారాల ప్రకారం మహిళను ఊపిరాడకుండా చేసి చంపేశారని తెలుస్తోందని, మహిళపై లైంగిక దాడి జరిగిందా అనే వివరాలు పోస్ట్మార్టం అనంతరం వెల్లడవుతాయని ఏసీపీ వికాస్ కౌశిక్ తెలిపారు. బాధితురాలిని గుర్తించేందుకు మృతురాలి ఫోటోను ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు అన్నింటికీ పంపామని చెప్పారు.