న్యూఢిల్లీ: మెషిన్ విడిభాగాల రూపంలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.42 కోట్ల విలువైన 85.5 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఢిల్లీలోని ఛత్తర్పూర్తోపాటు పొరుగు జిల్లా గుర్గావ్లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. బంగారాన్ని యంత్ర భాగాల రూపంలో వివిధ ఆకారాల్లో తయారు చేసి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.
మెషిన్ విడిభాగాలుగా ఉన్న బంగారాన్ని అనంతరం కరిగించి కడ్డీలు ఇతర రూపాల్లోకి మార్చి స్థానిక మార్కెట్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బంగారం అక్రమ రవాణాకు సంబంధించి నలుగురు విదేశీయులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇద్దరు దక్షిణ కొరియాకు చెందిన వారని, ఒకరు చైనా, మరొకరు తైవాన్కు చెందిన వారని వివరించారు.