రాయ్పూర్: ఒంటరిగా గుడికి వెళ్లి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసిన తాగుబోతులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఈ ఘటన జరిగింది. 13 ఏండ్ల బాలిక ప్రతిరోజూ ఒంటరిగా గుడికి వెళ్లి వస్తుండేది. మద్యం సేవించి జులాయిగా తిరిగే నలుగురు వ్యక్తులు ఆమెను గమనించసాగారు. గురువారం గుడికి వెళ్లి ఇంటికి వస్తున్న బాలికను ఆ నలుగురు కిడ్నాప్ చేశారు. సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, బాధితురాలు అతి కష్టంమీద లేచి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే కొద్ది దూరం నడిచి కిందపడిపోయింది. మరోవైపు బాలిక తల్లిదండ్రులు ఆమె కోసం వెతుకుతూ అటుగా వచ్చారు. గాయాలతో పడి ఉన్న ఆమెను గమనించి విషయం తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితులైన దీపక్ నిషాద్ (27), సూరజ్ సూర్యవంశీ (21), సూరజ్ యాదవ్ (20), మహేష్ పాసి (19)లను శుక్రవారం అరెస్టు చేశారు. వారిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.