ఉదయాన్నే నిద్రలేచేసరికి ఒక మెసేజ్ వచ్చిందా పెద్దాయనకు. ‘‘మీరు కరెంట్ బిల్లు కట్టలేదు. ఈ రోజు కూడా బిల్లు కట్టకపోతే సాయంత్రం 9.30 తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయబడుతుంది’’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దాంతో షాకైన ఆయన.. డాక్టర్గా పనిచేస్తున్న తన కూతురికి మెసేజ్ చూపించాడు.
దాంతో బిల్లు నిజంగానే కట్టలేదని అనుకున్న ఆమె కరెంట్ బిల్లు కట్టింది. ఆ తర్వాత చూస్తే ఆమె ఖాతల నుంచి ఏకంగా రూ.48500 పోయినట్లు ఆమెకు అర్థమైంది. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది. ఘట్కోపర్కు చెందిన బాధితురాలు.. తండ్రి ఫోన్కు వచ్చిన మెసేజ్ చూసి కంగారు పడింది. వెంటనే కరెంట్ బిల్లు కట్టేయడానికి ప్రయత్నించింది.
మెసేజ్లో ఉన్న ‘‘ఎలక్ట్రిసిటీ ఆఫీసర్’’ నెంబరుకు కాల్ చేసింది. అతను ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని పేమెంట్ చేయాలని చెప్పాడు. తండ్రి ఫోన్లో అలా చేయడం కుదరలేదు. దాంతో తన మొబైల్లోనే ఆమె ఆ యాప్ డౌన్లోడ్ చేసింది. ఆ తర్వాతే తను మోసపోయినట్లు తెలుసుకుంది. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించిందా వైద్యురాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.