భోపాల్ : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని విదిశలో జూన్ 28న ఈ దారుణం వెలుగుచూసింది. ప్రధాన నిందితుడిని అమిత్ రాయ్, బాధితురాలిని మధుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమిత్ రాయ్ బాధితురాలి ఇంటి వెలుపల నిలుచుని ఉండగా మహిళ తల్లి అతడిని అక్కడి నుంచి వెళ్లాలని కోరింది.
దీంతో ఆగ్రహానికి లోనైన నిందితుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి బాధితురాలికి నిప్పంటించాడు. స్ధానికులు మంటలు ఆర్పి ఆమెను ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఈ నేరానికి పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు. మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.