భువనేశ్వర్ : ఒడిషాలో రెండు వేర్వేరు ఘటనల్లో చేతబడి చేస్తున్నారని ఆరోపిస్తూ జరిగిన దాడుల్లో ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు మరణించారు, హత్యలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ ఇద్దరు మైనర్లతో పాటు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కునజం ప్రాంతంలో చేతబడి చేస్తున్నారే ఆరోపణపై నిందితులు దాడి చేయడంతో ఓ వ్యక్తి ఆయన భార్య, మేనల్లుడు మరణించారు.
సమకోయ్ నది వద్ద రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇక మరో ఘటనలో మయూర్భంజ్ జిల్లాలోని రరౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంటి నుంచి వితంతువు మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వితంతు మహిళ చేతబడి చేస్తుందనే అనుమానంతో తిలుసహి గ్రామంలోని ఆమె ఇంట్లోనే మహిళను గొడ్డలితో నరికి చంపారని పోలీసులు ఆరోపించారు.