న్యూఢిల్లీ : వాట్సాప్ హ్యాకింగ్ రాకెట్ను భగ్నం చేసి విదేశీయుడిని స్పెషల్ సెల్, సైబర్ క్రైమ్ యూనిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, బెంగళూర్ నుంచి పనిచేస్తున్న ఈ ముఠాకు చెందిన పట్టుబడ్డ నిందితుడిని ఇమ్మానుయేల్ అలియాస్ మౌరిస్ డెగ్రిగా గుర్తించారు. ఈ ముఠా టార్గెట్ చేసిన వారి వాట్సాప్ను హ్యాక్ చేసి ఆయా వ్యక్తుల కాంటాక్ట్ నెంబర్లకు అభ్యంతరకర మెసేజ్లను పంపుతూ డబ్బు డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడైంది.
ఓ బాధితుడి ఫిర్యాదుతో ఈ ముఠా వ్యవహారం వెలుగుచూసింది. ఫిర్యాదుదారు కాంటాక్ట్లకు డబ్బు బదిలీ చేసేలా వారికి నిందితుడు తన బ్యాంక్ ఖాతా వివరాలను కూడా ఇచ్చాడని స్పెషల్ సెల్ డీసీపీ కేపీఎస్ మల్హోత్ర వెల్లడించారు. నిందితుడి నుంచి 15 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాన్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.