హైదరాబాద్ : బ్లాక్మార్కెట్లో అధిక ధరలకు బ్లాక్ఫంగస్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నగరంలోని ఎస్.ఆర్.నగర్ పరిధి బీకే గూడలో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ టీం రైడ్ చేసి నిందితులను పట్టుకున్నారు. వీరి వద్ద నుండి తొమ్మిది బ్లాక్ఫంగస్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్ఆర్ నగర్కు చెందిన మెడికల్ ఏజెంట్ వి. వేణుగోపాల్, బంజారాహిల్స్ నివాసి జి. నవీన్, కొత్తపేటకు చెందిన వి. అశోక్, నిజాంపేటకు చెందిన కే. ప్రసాద్, కూకట్పల్లి నివాసి బి. హరీశ్గా గుర్తించారు.