మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లా పరిధిలోని మల్లాపూర్ పారిశ్రామికవాడలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కుర్చీల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. పక్కనున్న రసాయన పరిశ్రమలకు మంటలు వ్యాపిస్తున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.