నల్లగొండ : ఇది హృదయ విదారక ఘటన.. రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించగా, తండ్రి షాక్కు గురై గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరి మరణాలతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లి ఆస్పత్రి పాలైంది. హృదయాన్ని ద్రవీంపజేసే ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
తడకమల్ల గ్రామంలోని చౌదరి కాలనీకి చెందిన గోర్ల ఇంద్రారెడ్డి(52) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ రైతుకు భార్య సుజాత, కుమారుడు భరత్ రెడ్డి(30) ఉన్నారు. అయితే ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో వ్యవసాయ పనులను ముగించుకుని ఇంటికి బయల్దేరిన భరత్ రెడ్డి బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో భరత్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
రోడ్డుప్రమాదంలో కుమారుడు మరణించాడన్న వార్త ఇంద్రారెడ్డికి తెలిసింది. ఆ వార్తను తట్టుకోలేని ఆయనకు గుండెపోటు వచ్చింది. ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. బంధువులు అతన్ని ప్రయివేటు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. గంట వ్యవధిలోనే తండ్రీకుమారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కొడుకు, భర్త మరణవార్తలతో సుజాత కూడా తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. ఆమె బీపీ లెవల్స్ తగ్గిపోవడంతో.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చూడండి