నాగర్కర్నూల్ : జిల్లా పరిధిలోని బిజినేపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే బైక్పై ప్రయాణిస్తున్న తండ్రీకుమారుడు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులను వట్టెం గ్రామానికి చెందిన బాలయ్య గౌడ్ (65), శివకుమార్ గౌడ్ (35)గా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.