హైదరాబాద్ : మీర్పేట్కు చెందిన వివాహిత శ్వేతారెడ్డికి బాగ్ అంబర్పేట్కు చెందిన యశ్మ కుమార్ను ప్రశాంతి హిల్స్లో హత్య చేయించిన దృశ్యాలు విడుదలయ్యాయి. యశ్మ కుమార్ను హత్య చేసిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. యశ్మ కుమార్ను ఈ నెల 5వ తేదీన రాత్రి 12:43 గంటలకు హత్య చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. యశ్మ కుమార్ తన బైక్పై వచ్చి ప్రశాంతి హిల్స్లో ఆపాడు.
అప్పటికే అక్కడ మాటు వేసిన అశోక్ అనే యువకుడు యశ్మ కుమార్తో మాటలు కలిపి.. తల వెనుక భాగంలో సుత్తితో బలంగా బాదాడు. దీంతో యశ్మ కిందపడిపోయాడు. మరో రెండు, మూడు సార్లు తలపై సుత్తితో మోదాడు. కాసేపు అక్కడే ఉన్న అశోక్.. ఓ ఇద్దరు వ్యక్తులు తమ కారును ఆపి పోలీసులకు ఫోన్ చేస్తుండగా అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. యశ్మను స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మృతి చెందాడు. సీసీ కెమెరా ఫుటేజీ సహాయంతో పోలీసులు కేసు ఛేదించారు. ఈ కేసులో శ్వేతా రెడ్డితో పాటు అశోక్, కార్తీక్ అనే యువకులను పోలీసులు రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్ మీర్పేటలో ఫేస్బుక్ ప్రియుడ్ని మరో ప్రియుడి చేత శ్వేతారెడ్డి హత్య చేయించిన దృశ్యం.. pic.twitter.com/BuhQK37FBv
— Namasthe Telangana (@ntdailyonline) May 13, 2022