ముంబై : యాడ్ ఫిల్మ్లో నటించాలనే ఆఫర్ను తిరస్కరించిన మహిళ (29)పై ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ సహవ్యవస్ధాపకుడు వేధింపులకు పాల్పడిన ఘటన కళ్యాణ్లో వెలుగుచూసింది. మహిళ ఫిర్యాదుపై నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని ఉల్లాస్నగర్కు చెందిన గురుదీప్సింగ్ ఖల్సాగా గుర్తించారు. ఖల్సా తన తండ్రితో కలిసి ఫ్యాషన్ షోలు నిర్వహించే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతున్నారు.
ఐదేండ్ల కిందట ఖల్సా మహిళకు ఓ వీడియో యాడ్లో నటించాలని కోరాడు. ఆమె ఈ ఆఫర్ను తిరస్కరించినప్పటి నుంచి కక్ష పెంచుకున్నాడు. నిందితుడు ఆమెకు అసభ్య మెసేజ్లు పంపుతూ వీడియో కాల్స్ చేసేవాడు. వీడియో కాల్స్ చేసినప్పుడు ముఖం కనిపించకుండా జాగ్రత్త పడేవాడు. నేరానికి పాల్పడేందుకు నిందితుడు వర్చువల్ ఇంటర్నేషనల్ నెంబర్స్ వాడేవాడు. థానే సైబర్ సెల్ సహకారంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో భాగంగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.