Student Dies : కర్నాటక రాజధాని బెంగళూర్లో దారుణం జరిగింది. బెంగళూర్ మెట్రపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్ శుక్రవారం ఇంజనీరింగ్ విద్యార్ధినిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో విద్యార్ధిని కుసుమిత (21) ప్రాణాలు కోల్పోయింది.
బాధిత విద్యార్ధిని ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మల్లేశ్వరం ప్రాంతంలో ఆమె స్కూటీని బస్ ఢీకొంది. ఈ ప్రమాద ఘటన సమీప సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్పై కఠిన చర్యలు చేపట్టాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
JMM MLA: హైదరాబాద్ వెళ్తున్నాం.. బిర్యానీ తినేందుకు.. మీడియాతో జార్ఖండ్ ఎమ్మెల్యే.. వీడియో