న్యూఢిల్లీ: నైట్ కర్ఫ్యూ వేళలో ఫుడ్ సర్వ్ చేయనందుకు ఒక ఈటరీ యజమానిని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్కు చెందిన నోయిడాలో ఈ ఘటన జరిగింది. హాపూర్కు చెందిన 27 ఏండ్ల కపిల్ గ్రేటర్ నోయిడాలో ఒక ఈటరీని నిర్వహిస్తున్నాడు. కాగా, కరోనా నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించారు. శనివారం నైట్ కర్ఫ్యూ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఈటరీకి వచ్చారు. తమకు ఫుడ్ సర్వ్ చేయాలని డిమాండ్ చేశారు. నైట్ కర్ఫ్యూ వల్ల షాపు మూసేనట్లు కపిల్ తెలిపాడు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 3.30 గంటలకు తిరిగి అక్కడకు వచ్చారు. ఈటరీ యజమాని కపిల్పై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు.
మరోవైపు, పారి చౌక్ ప్రాంతంలో ఒక వ్యక్తిపై కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బుల్లెట్ గాయాలైన కపిల్ను ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ చనిపోయాడు. నిందితులు ఆకాశ్, యోగేంద్రగా గుర్తించిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.