న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ ( Drugs seized ) పట్టుబడ్డాయి. ఉగాండాకు చెందిన ఓ మహిళ 992 గ్రాముల కొకైన్ను క్యాప్సూల్స్లో నింపి మింగేసింది. అనంతరం ఆ డ్రగ్స్ను మనదేశంలోకి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ, ఆమె ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడి కస్టమ్స్ అధికారులు అనుమానించి తనిఖీ చేశారు.
మహిళ కడుపులో కొకైన్ నింపిన క్యాప్సూల్స్ ఉన్నట్లు గుర్తించి వాటిని వెలికితీశారు. మొత్తం 91 క్యాప్సూల్స్ను బయటికి తీయించారు. వాటిని తూచి చూడగా 992 గ్రాముల బరువు తూగాయి. కాగా, ఆ డ్రగ్స్ విలువ సుమారుగా రూ.14 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. స్మగ్లింగ్కు పాల్పడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై NDPS చట్టంలోని సెక్షన్ 43(b) కింద కేసు నమోదు చేశారు.