బెంగళూర్ : న్యూ ఇయర్ పార్టీ కోసం సిద్ధం చేసిన రూ 80 లక్షల విలువైన డ్రగ్స్ను బెంగళూర్ పోలీస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు సీజ్ చేశారు. బగలూర్ పీఎస్ పరిధిలో సీసీబీ నార్కోటిక్స్ విభాగం చేపట్టిన ఈ దాడుల్లో ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేశారు.
కాలేజ్ స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు, వ్యాపారులకు ఇద్దరు నిందితులు డ్రగ్స్ చేరవేస్తున్నారు. ముంబై నుంచి నిషేధిత డ్రగ్స్ను వీరు తీసుకువస్తూ స్ధానికులకు సరఫరా చేస్తున్నారని బెంగళూర్ పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు బిజినెస్ వీసాలపై బెంగళూర్ సందర్శించినట్టు పోలీసులు వెల్లడించారు.
గత నెలలోనూ బెంగళూర్లో డీఆర్ఐ అధికారులు ఎలక్ట్రిక్ గిటార్లో దాచిన రూ 50 లక్షల విలువైన డ్రగ్స్ను సీజ్ చేశారు. తమిళనాడు నుంచి బెంగళూర్ మీదుగా ఆస్ట్రేలియాకు అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ను బెంగళూర్లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.