న్యూఢిల్లీ: భర్త ఇంటికి వస్తుండటం చూసిన భార్య, బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ముఖర్జీ నగర్లోని నిరంకారి కాలనీలోని ఒక అపార్ట్మెంట్ భవనంలో 52 ఏండ్ల నేహ, భర్త ధరమ్ వర్మ నివసిస్తున్నారు. వారి కుమారుడు, కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. అయితే ఈ దంపతులు విడిపోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో నేహ మంగళవారం బయటకు వెళ్లిన తన భర్తకు ‘ఐ లవ్ యు’ మెసేజ్ పెట్టింది. ఆయన ఇంటికి తిరిగి వస్తుంటాన్ని చూసి అపార్ట్మెంట్ బిల్డింగ్లోని ఐదవ అంతస్తు టెర్రస్ పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.
కాగా, ఆమె భవనం పైనుంచి దూకిన ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఆ మహిళ మొబైల్ ఫోన్ను పరిశీలిస్తున్నారు. అమెరికాలో ఉన్న కుమారుడు, కుమార్తె ఢిల్లీ చేరిన తర్వాత మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహిస్తామని తెలిపారు.