న్యూఢిల్లీ: బంధువైన పోలీస్ అధికారిని ఒక పోలీస్ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చి హత్య చేశాడు. కుటుంబ గొడవ నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న పోలీస్ కానిస్టేబుల్ విక్రమ్ సింగ్ ఆదివారం ఉదయం తన బావ అయిన 36 ఏండ్ల వీరేంద్ర నంద తలలో తుపాకీని కాల్చాడు. హర్యానాలో ఎస్ఐ అయిన నందను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు కానిస్టేబుల్ విక్రమ్ సింగ్ను అరెస్ట్ చేశారు. కాల్పులు జరిపిన సర్వీస్ రివాల్వర్ను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఎస్ఐ వీరేంద్ర నంద ఐదారేండ్లగా నిందితుడైన పోలీస్ కానిస్టేబుల్ విక్రమ్ సింగ్తో కలిసి ఆ ఇంట్లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరి మధ్య డబ్బు వ్యవహారానికి సంబంధించిన వివాదం వల్ల కాల్పుల ఘటన జరిగినట్లు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.